ఉగ్రదాడి.. బీసీసీఐ సంచలన నిర్ణయం..!

-

జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు దాడి చేయడంతో 28 మంది భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై దేశ వ్యాప్తంగా ఉగ్రవాదులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో భారత్ కి ద్వైపాక్షిక సిరీస్ లు ఉండబోవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య చివరగా 2012-13 లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి ఐసీసీ టోర్నీలో మాత్రమే భారత్ -పాక్ తలపడుతున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో ఇక భవిష్యత్ లో ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించవద్దని బీసీసీఐ నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో పాల్గొన్న ముష్కరులపై జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ పోలీసులు రివార్డు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news