కరీంనగర్ ; దొంగ బాబా ఘరానా మోసం..12 లక్షలతో పరార్

-

డబ్బుకు ఆశపడి ఓ దొంగ బాబా చేతిలో ఘోరంగా మోసపోయారు కరీంనగర్ కు చెందిన ముగ్గురు యువకులు. డబ్బు ఆశ చూపి లక్షల డబ్బుతో ఉడాయించాడు హైదరాబాద్ కు చెందిన దొంగ బాబా. పూజలు చేస్తే డబ్బు రెండింతలు అవుతుందని ముగ్గురు యువకులను నమ్మించి మోసం చేశాడు ఆ దొంగ బాబా. బాబా మాయలో పడిన ముగ్గురు యువకులు అతని నమ్మి ఏకంగా 12 లక్షలు అతని చేతిలో పెట్టారు.

హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి వచ్చిన ఓ యువకుడు ఆ బాబా గురించి చెప్తే నమ్మి డబ్బులు ఇవ్వడానికి ఆ యువకులు, కొత్తపల్లికి చెందిన మధ్యవర్తి తో హైదరాబాద్ కి బయలుదేరారు. ఆ దొంగ బాబా కి పన్నెండు లక్షలు ఇవ్వడంతో.. పూజలు చేసి వస్తానని చెప్పి డబ్బులతో పారిపోయాడు. ఆ బాబా తిరిగి రాకపోవడంతో తీవ్రంగా గాలించి ఇంటికి చేరారు యువకులు. వారు మోసపోయామని గ్రహించి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మొత్తానికి డబ్బులు రావని భావించి మధ్యవర్తిత్వ సెటిల్మెంట్ చేసుకునేలా బాధితులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news