కేసీఆర్ రథం ఎక్కి గర్జన చేసిండు కాబట్టే రైతుబంధు పడుతుంది : కేసీఆర్

-

కేసీఆర్ రథం ఎక్కి గర్జన చేసిండు కాబట్టే రైతుబంధు పడుతుందని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. రైతు బంధు కింద రూ.2వేల కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 5 ఎకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో వాటిని జమ చేసింది. కాగా ఈనెల 9లోగా రైతు భరోసా నిధులను పూర్తిగా జమ చేస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.

kcr

వీటితో పాటు పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.10వేల నిధులను కూడా ఎన్నికల సంఘం అనుమతితో ప్రభుత్వం విడుదల చేసింది. అయితే.. దీనిపై కేసీఆర్‌ స్పందించారు. కేసీఆర్ రథం ఎక్కి గర్జన చేసిండు కాబట్టే రైతుబంధు పడుతుందని తెలిపారు. తెలంగాణ శక్తి బీఆర్ఎస్.. తెలంగాణ బలం బీఆర్ఎస్.. తెలంగాణ గళం బీఆర్ఎస్.. తెలంగాణ దళం బీఆర్ఎస్ అన్నారు. ఇయ్యాల బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకి దెయ్యం వదిలి ముఖ్యమంత్రి రైతుబంధు వేస్తున్నాడని వివరించారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news