కేసీఆర్ నిర్ణయం హిరోషిమాపై పడ్డ అనుబాంబు కన్నా దారుణం – రేవంత్ రెడ్డి

-

జీవో నెంబర్ 111 ను రద్దు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయం హీరోషిమా పై పడ్డ అనుబాంబు కన్నా దారుణమని పేర్కొన్నారు. ప్రజాధనం కొల్లగొట్టేందుకే 111 జీవోను ప్రభుత్వం రద్దు చేయడానికి పూనుకుందని అన్నారు. జీవోను రద్దు చేసి లక్షల కోట్లు వెనుకేసుకోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు.

కేసీఆర్ హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నాడని.. ఈ విధ్వంసం వెనుక భూ కుంభకోణం ఉందన్నారు. పీజేఆర్ పోరాటం వల్లే కృష్ణా జలాలు హైదరాబాద్ కి వచ్చాయన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో గోదావరి జిల్లాలు వచ్చాయని తెలిపారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news