శరత్ బాబు మృతి పట్ల సోము వీర్రాజు దిగ్బ్రాంతి

-

సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. 300 కి పైగా అనేక సందేశాత్మక సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులు గెలిచిన సీనియర్ నటులు శరత్ బాబు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాగా.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు నేడు హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. నెల రోజులకు పైగా హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా నేడు పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. 1951 జులై 31న శ్రీకాకుళం లోని ఆముదాలవలస లో జన్మించారు శరత్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news