ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి కేసీఆర్‌ శుభవార్త

-

ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. 2014 కు ముందు ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్న వారికి భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది సర్కార్‌.

ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసుకున్న వారు ఆగస్టు 1 నుంచి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. ఇక దరఖాస్తులు చేసుకునేందుకు మూడు నెలల పాటు సమయం ఇచ్చింది తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ. 125 గజాల లోపు ఉన్న నిర్మాణానికి స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. 125 గజాల నుంచి 3 వేల వరకు ఉన్న నిర్మాణానికి ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరింది సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news