మెదక్ జిల్లాలో నేడు కేసీఆర్ బహిరంగ సభ

-

పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వరుస సమావేశాలు, సభలతో దూసుకెళ్తోంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఇటీవల చేవెళ్లలో సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈరోజు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

సుల్తాన్‌పూర్‌లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభకు మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనసమీకరణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కేసీఆర్‌ ఈ సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభా వేదికగా కాంగ్రెస్ అబద్ధపు హామీలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ప్రారంభం కానుంది. కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో పటాన్‌చెరు, సంగారెడ్డి మీదుగా సుల్తాన్‌పూర్‌ చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news