ఇవాళ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కీలక సమావేశం

-

ఇవాళ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారు. ఈ భేటీలో ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్‌ బీ ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రూ.95 లక్షల విలువైన చెక్కులు ఇవ్వనున్నారు. ఎన్నికల ఖర్చు కోసం ఈ చెక్కులు ఇవ్వనున్నట్లు సమాచారం.

బీ ఫారాల అందజేత తర్వాత కేసీఆర్ పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై అభ్యర్థులకు గులాబీ బాస్ దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోనూ కేసీఆర్ భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై నేతలతో చర్చించనున్నారట. బస్సు యాత్రల రూట్‌ మ్యాప్‌పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రైతుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవాలని అభ్యర్థులకు, నాయకులకు కేసీఆర్ ఈ సమావేశంలో సూచించనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news