నెల రోజుల్లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేస్తాడు – బూర నర్సయ్య గౌడ్

-

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటే సీఎం కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు బిజెపి నేత బూర నర్సయ్య గౌడ్. ఇక్కడ ప్రజలు మునిగిపోతుంటే.. కెసిఆర్ మహారాష్ట్ర రాజకీయాలలో మునిగిపోయారని మండిపడ్డారు. కెసిఆర్ కి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఉత్తర తెలంగాణ మునిగిపోతే పట్టించుకోరా..? అని ప్రశ్నించారు.

వరదల కారణంగా చనిపోయిన కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలేశ్వరం ఖర్చు ఎంత, లాభం లాభం ఎంత, సమ్మక్క బ్యారేజీ వల్ల లాభం ఎంత, ఖర్చు ఎంత అన్నవాటిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంత కష్టపడ్డా జల్లెడలో నీరు పోసినట్టేనని.. నెల రోజుల్లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేస్తాడని అన్నారు. కాంగ్రెస్ నేతలు వెంటనే బిజెపిలో చేరాలని కోరుతున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news