తన కుమారుడు కనిపించడం లేదంటూ.. డీజీపీకి కేసీఆర్‌ అన్న కుమార్తె ఫిర్యాదు

-

తన కుమారుడు కనిపించడం లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రమ్య రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. మొదట ఆమెను డీజీపీ కార్యాలయానికి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకోవడంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వాళ్లు అనుమతించడంతో కార్యాలయం లోపలికి వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేశారు.

తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లి అరెస్టు చేసినట్లు చూపించడం లేదంటూ రమ్యరావు ఆరోపించారు. తన కుమారుడి ఆచూకీ తెలపాలని డిమాండ్‌ చేశారు. అర్ధరాత్రి తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) గురువారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది.

దీంతో ఎన్ఎస్‌యూఐ ముఖ్య నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వాళ్లను ఎక్కడ ఉంచారనే విషయం తెలియకుండా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అరెస్టయిన వారిలో రమ్యరావు కుమారుడు రితేశ్‌రావు కూడా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news