సీఎం కేసీఆర్‌ మద్దతుతో మాకు అండ పెరిగింది – సీఎం కేజ్రీవాల్‌

-

సీఎం కేసీఆర్‌ పై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీ ఆర్ కు ధన్యవాదాలు అని.. కేంద్ర ఆర్డినెన్సు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మద్దతు తో మాకు అండ పెరిగిందని.. డిల్లీ ప్రజల తరపున కేసీఅర్ కు ధన్య వాదాలు చెప్పారు. 2015 లో మేము అధికారం లోకి వచ్చిన మూడు నెలలకు ఢీల్లీ ప్రభుత్వం నుంచి అధికారుల లాక్కుందని.. 8 ఏళ్ల పోరాటం చేశామన్నారు.

సుప్రీం కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతూ మోడీ సర్కార్ ఆర్డినెన్సు తీసుకువచ్చిందన్నారు కేజ్రీవాల్. నాన్ బిజెపి సర్కార్ ఉంటే మోడీ సర్కార్ పని చేయడం లేదని… ఇలా దేశం ముందుకు సాగదని హెచ్చరించారు. రాజ్య సభలో బిజెపి కి మెజార్టీ లేదని.. నాన్ బిజెపి పా ర్టీలు ఒక్కటి అయితే రాజ్య సభలో బిల్లు ఆమోదం పొందదని స్పష్టం చేశారు కేజ్రీవాల్.

Read more RELATED
Recommended to you

Latest news