ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దు : తెలంగాణ హైకోర్టు

-

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనంపై గత ఏడాది ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు తెలిపింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని తయారీదారులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర పీసీబీ నిబంధనలు కొట్టివేయాలని తయారీదారుల పిటిషన్ దాఖలు చేశారు.

పీఓపీ విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని గత ఏడాది హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పీఓపీ విగ్రహాలు కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం చేయాలని గత ఏడాదే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. గత ఏడాది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు హామీ ఇచ్చింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 25వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 28వ తేదీన వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న వినాయక చవితిని నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news