బీజేపీ లోకి మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ?

-

త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. మరికొన్ని పార్టీలు నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి. దీంతో టికెట్ రాదని… భావించిన నేతలందరూ పార్టీ మారుతున్నారు.

ఈ తరుణంలో బీఆర్ఎస్ నేత, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి కిషన్ రెడ్డి వెళ్లారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి వెళ్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ పార్టీలోకి రావాలని కోరారు కిషన్ రెడ్డి.. కొంత సమయం కోరిన సీతారాం నాయక్…త్వరలోనే బీజేపీ లో చేరనున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news