పార్టీ మారిన వాళ్ళకు సిగ్గు, శరం, లజ్జ లేదు – పాడి కౌశిక్‌ రెడ్డి

-

పార్టీ మారిన వాళ్ళకు సిగ్గు, శరం, లజ్జ లేదని… హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదు….దీనిపై కోర్టు లో పిటిషన్ వేసానని వెల్లడించారు. కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది….స్థానిక శాసన సభ్యుడు పంపిణీ చేయవచ్చని ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు.

padi koushik reddy

GO ను కచ్చితంగా ఫాలో కావాల్సిందే అని కోర్టు చెప్పింది…. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారని ఆగ్రహించారు. రేవంత్ రెడ్డి అన్న ఏ విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారని నిలదీశారు. ఏ హోదాలో ఆయన పంచుతున్నారు.

సిగ్గుందా మీకు? మీరు గెలిచినట్టే మేము కూడా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళమే అంటూ స్పష్టం చేశారు. ఇవాళ మమల్ని ఇబ్బంది పెడుతున్నారు..రేపు మేము అధికారం లోకి వచ్చాక చూపిస్తామని హెచ్చరించారు. నన్ను ఇబ్బంది పెట్టండి కానీ, హుజురాబాద్ ప్రజలని ఇబ్బంది పెట్టొద్దు అంటూ నిప్పులు చెరిగారు హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news