KTR: రోడ్డు పక్కన చాయ్ దుకాణంలో టీ ఎంజాయ్ చేసిన కేటీఆర్

-

సంగెం హోటల్లో టీ తాగారు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లగొండ జిల్లాలో BRS పార్టీ కార్యక్రమాలను దిగ్విజయంగా ముగించుకొని హైదరాబాదుకు వెళుతున్న క్రమంలో మార్గ మధ్యంలో కోయిలగూడెం దగ్గర సంగెం హోటల్లో టీ తాగారు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్‌ తో పాటు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్, నోముల భగత్ టీ తాగారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

KTR enjoying tea at a roadside chai shop

కాగా న‌ల్ల‌గొండ మండ‌లం ముషంప‌ల్లి గ్రామంలో రైతులు గ‌న్నెబొయిన మ‌ల్ల‌య్య‌, బోర్ల రాంరెడ్డిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర మంత్రుల‌కు ద‌మ్ము, ధైర్యం ఉంటే క‌రెంట్ కోత‌ల్లేవ‌ని, సాగునీటి కొర‌త లేద‌ని రైతుల ముందుకు వ‌చ్చి చెప్పాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news