మేం అధికారంలో ఉంటే నెలరోజుల పాటు సంబురాలు నిర్వహించేవాళ్లం : కేటీఆర్

-

తాము అధికారంలో ఉంటే నెలరోజుల పాటు సంబురాలు నిర్వహించే వాళ్లమని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి మూర్ఖుడు కాబట్టి. దశాబ్ది ఉత్సవాలను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సైతం జైతెలంగాణ అనలేరని ఫైర్ అయ్యారు. ఈరోజు కూడా తన శుభాకాంక్షల సందేశంలో జై తెలంగాణ అనలేకపోయారని రేవంత్పై కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి జాక్ పాట్ ముఖ్యమంత్రి అని… ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదని వ్యాఖ్యానించారు.

“రాష్ట్ర ఆవిర్భావం జరిగి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మా పార్టీ తరపున, 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చివరికి ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ వందనాలు. ఈ పండుగ వాతావరణం జరుపుకుంటున్న ఈ దశాబ్ది ఉత్సవాల పూర్తిగా సంబురాల నేపథ్యంలో తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం.” అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news