సోనియమ్మ వల్లే తెలంగాణ వచ్చింది – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

-

సోనియమ్మ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ సంద‌ర్భంగా వారు చేసిన సేవ‌ల‌ను గుర్తు చేశారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం త‌మ ప్రాణాల‌ను అర్పించిన అమ‌రుల‌ త్యాగాల్ని స్మరించుకునే ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ‌ ఫలాలు అందరికీ స‌మానంగా అందినప్పుడే అమరులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.

ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం పోరాడిన ఉద్య‌మకారుల‌కు, స‌క‌ల జ‌నుల‌కు, ప్ర‌త్యేక రాష్ట్ర అకాంక్షను గౌర‌వించి మ‌ద్ధ‌తు తెలిపిన ప్ర‌తీ ఒక్క‌రికీ, తెలంగాణ క‌ల‌ను సాకారం చేసిన సోనియా గాంధీకి ఈ సంద‌ర్భంగా మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు మంత్రి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్ కు ప‌ట్టం క‌ట్టార‌ని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news