ఇవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు : మంత్రి కేటీఆర్

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మోదీ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించారు. కవితకు ఇచ్చినవి ఈడీ నోటీసులు కాదని.. మోదీ నోటీసులని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం పై ఓవైపు ప్రతిపక్షాలపై కేసుల దాడి.. మరోవైపు ప్రజలపై ధరల దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో 8 ఏళ్లగా జుమ్లా.. లేకపోతే హమ్లా నడుస్తోంది. ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. మా నాయకులు 12 మందిపై ఈడీని, సీబీఐని పంపించారు. ఇవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు. ప్రతి పక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి. గౌతం అదానీ ఎవరి బినామీ..? అదానీ.. మోదీ బినామీ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. ముంద్రా పోర్టులో రూ.21 వేల కోట్లు డ్రగ్స్‌ దొరికినా అదానీపై చర్యలు ఎందుకు లేవు? అని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version