నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ రోడ్​ షోలు

-

బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచారు. ఇవాళ్టి నుంచి కేటీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ షోలతో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి సుమారు తొమ్మిది గంటల వరకు కేటీఆర్ ప్రచారం కొనసాగనుంది. ఈనెల 20వ తేదీ వరకు మొదటి విడతలో గ్రేటర్ హైదరాబాద్​లోని 11 నియోజకవర్గాలు సహా 29 ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు.

ఇవాళ సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని కథలాపూర్, మేడిపల్లి, కోనరావుపేట, వేములవాడ, తంగలపల్లిలో కేటీఆర్ రోడ్ షో చేయనున్నారు. ఎల్లుండి చేవెళ్ల, వికారాబాద్, మర్పల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్​లో కేటీఆర్ పర్యటిస్తారు. ఈనెల 17న మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్​లో ప్రచారం జరగనుంది. ఈనెల 18న రామగుండం, కొత్తగూడెం, నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్​లో ఈనెల 19న భద్రాచలం, ఇల్లందు, ఖమ్మం, అంబర్ పేట, ముషీరాబాద్, 20వ తేదీన ఆలేరు, మిర్యాలగూడ, ఉప్పల్, ఎల్బీనగర్​లో పర్యటిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news