ఇదేనా స్వదేశీ నినాదం..? : మోదీకి మంత్రి కేటీఆర్ ట్వీట్

-

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మంత్రి కేటీఆర్‌ మరోసారి విమర్శలు, వ్యంగాస్త్రాలు సంధించారు. నాడు మహాత్మా గాంధీజీ స్వదేశీ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడానికి “ఆత్మ నిర్భర్” చిహ్నంగా “చరఖా” ఉపయోగిస్తే… ఇప్పుడు చేనేత, ఖాదీ వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధానిగా మోదీ….. సందేహాస్పదమైన ఓ గుర్తింపు సాధించారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేసిన కేటీఆర్…. ఇదేనా మీరు సాధించిన “ఆత్మ నిర్భర్ భారత్”…అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం జాతికి తెలియచెప్పే స్వదేశీ నినాదం ఇదేనా అన్నారు.

ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కానుకగా ప్రకటించిన నేతన్న బీమా పథకంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలను కేటీఆర్ తిప్పికొట్టారు. గత 8 ఏళ్లలో చేనేత కార్మికుల కోసం కేంద్రం ఏం చేసిందో ఎందుకు చెప్పరని ఆయన ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌…. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఏం చేశారని నిలదీశారు. కనీసం తన సొంత నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్లలో ‘మెగా పవర్ లూమ్ క్లస్టర్‌’ కూడా మంజూరు చేయించలేని ఓ నిస్సహాయ ఎంపీగా బండి సంజయ్‌ని ఆయన అభివర్ణించారు.

Read more RELATED
Recommended to you

Latest news