జై కిసాన్.. మాకు కేవలం నినాదం కాదు.. మా ప్రభుత్వ విధానం : కేటీఆర్

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తాను రైతు బాంధవుడని నిరూపించుకున్నారు. రైతులకు రుణమాఫీ ప్రక్రియ రెండో విడతను ఇవాళ్టి నుంచే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ విడతలో మరో రూ.19వేల కోట్లు రుణమాఫీ జరగనుందని తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని రైతులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతించాయి.

రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ‘BRS అంటే భారత “రైతు” సమితి అని మరోసారి రుజువైంది. జై కిసాన్ అనేది మాకు కేవలం ఓ నినాదం కాదు.. మా ప్రభుత్వ విధానం అని మరోసారి తేలిపోయింది. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా బీజేపీ సర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనం రైతు సంక్షేమంలో తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకం దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం కానీ.. ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషం యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిది.’ అంటూ కేటీఆర్ తన ట్వీట్​లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news