త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తాం – మంత్రి కేటీఆర్

-

త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బీబీ పేట మండలం కొనాపూర్ లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మానేరు ప్రాజెక్టుకు మాకు అవినాభావ సంబంధం ఉంది..మా కుటుంబ చరిత్ర తెలుసుకోకుండా మా మీద నిందలు వేస్తున్నారన్నారు.

కొందరు కేసీఆర్ గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు..కేసీఆర్ పుట్టుకతోనే భూస్వామి అని చెప్పారు. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. 60 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబందు ఇస్తున్న ఏకైక రాష్ట్రం అని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని సస్యశామలం చేశాం..ఇంటింటికి నీళ్లు, 24 గంటల కరెంట్, పెన్షన్లు.. పల్లె ప్రకృతి వనాలు, అన్నారు. 60 ఏళ్లల్లో జరగని అభివృద్ధి 7 ఏళ్ళల్లో చేశాం… చిల్లర మాటలను పట్టించుకోమని తెలిపారు కేటీఆర్. తెలంగాణలో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు…

Read more RELATED
Recommended to you

Latest news