భద్రాచలం వెళ్తే.. సీఎం పదవి పోతుందని కేసీఆర్ వెళ్లడం లేదు – MP లక్ష్మణ్

-

సీఎం కేసీఆర్‌ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం వెళ్తే.. సీఎం పదవి పోతుందని కేసీఆర్ వెళ్లడం లేదన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. సీఎం కేసీఆర్ మూఢ విశ్వాసాలు ఈ సారి ఎన్నికలు గట్టెక్కించలేవని వెల్లడించారు.

భద్రాద్రి రాముడిని కూడా సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని ఆగ్రహించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. కేంద్రం రైతులకు సహాయం చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. SDRF కింద తెలంగాణకు కేంద్రం 3,250 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఎన్నికలు వస్తే తప్ప బీఆర్ఎస్ నేతలకు ప్రజలు గుర్తుకురారని నిప్పులు చెరిగారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Latest news