నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను విడిచిపెట్టండి : ఎంపీ నామా నాగేశ్వరరావు

-

నాయకులు మధ్య ఉన్న అంతర్గత విభేదాలను విడిచిపెట్టండి అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇవాళ సూర్యపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే నాయకులను అస్సలు నమ్మకండి..కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, గ్యారంటీలు ఉత్తుత్తి హామీలే అన్నారు. గతంలో తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారు? ఇప్పుడు హామీలతో మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నమ్మకండి.

గత తొమ్మిదేళ్లకు ముందు ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించిన నాయకుడు కేసీఆర్..అప్పుల పాలైన రైతులను ఆదుకున్న ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. రెండు విడతలలో 35 వేల కోట్లు రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్..కల్లబొల్లి మాటలు చెప్పి గ్యారెంటీలు చెప్పి మాయ మాటలు చెప్పే వాళ్ళని నమ్మకండి 60 ఏళ్ళు పరిపాలించి ఏం చేశారు. గిరిజన యూనివర్సిటీ పేరు చెప్పి మాయ మాటలు మోస పూరిత వాగ్దానాలను ఇచ్చే బిజెపిని అస్సలు నమ్మకండి. విభజన చట్టం ప్రకారం.. ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వకుండా మోసం చేస్తుంది బీజేపీ.

Read more RELATED
Recommended to you

Latest news