ఇద్దరం సచ్చుడో.. నిధులు తెచ్చుడో చూద్దాం : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. చర్చ జరుగుతున్న సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా.. హరీశ్ రావు, కేటీఆర్ స్పందించారు. ఢిల్లీలో మంత్రులు ఆమరణ దీక్ష చేయాలని పేర్కొన్నారు కేటీఆర్. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ని ఢిల్లీకి రమ్మని చెప్పండి. నేను కూడా దీక్షలో కూర్చుంటాను. ఇద్దరం సచ్చుడో.. నిధులు తెచ్చుడో చూద్దామన్నారు.

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పలేదన్నారు. మేము ఎవ్వరీ శవాలపై రాజకీయాలు చేయలేదు. రూ.100 పెట్టి పెట్రోల్ కొన్న ఆయనకు రూ.1 అగ్గిపెట్టే కొనడానికి పైసలు లేవా అని ప్రశ్నించారు. శ్రీకాంతచారి, యాదయ్య లాంటి వారి ప్రాణాలు కోల్పోయేలా తాము వ్యవహరించలేదన్నారు. డేట్ ఫిక్స్ చేయండి. మీరు ఎప్పుడూ వచ్చినా ఓకే.

Read more RELATED
Recommended to you

Latest news