హైదరాబాద్ లో మామిడి పండ్లు కావాలా…? తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం…!

-

వేసవి వచ్చింది అంటే చాలు మామిడి పండ్ల కోసం జనాలు ఏ స్థాయిలో ఎదురు చూస్తారో అందరికి తెలిసిందే. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ని కొనసాగిస్తున్నారు. దీనితో మామిడి పళ్ళు తినడానికి దిక్కు లేదు. దీనితో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండా మామిడి పండ్లను ఇవ్వాలని భావించింది.

తెలంగాణ ఉద్యాన శాఖ, తపాలాశాఖతో ఒప్పందం కుదుర్చుకుని మామిడి పండ్లు ఇవ్వడానికి సిద్దమైంది. దీనిపై ఉద్యాన శాఖ సంచాలకులు బి.వెంకటరెడ్డి కీలక ప్రకటన చేసారు. మీరు కోరిన 4, 5 రోజుల్లో పండ్లు ఇంటికి పంపిస్తామని చెప్పారు. నేరుగా మామిడి తోటల నుంచి పక్వానికి వచ్చిన కాయలను సేకరించి.. వాటిని శాస్త్రీయంగా అట్టపెట్టెలో మగ్గపెట్టి అలాగే అందిస్తామని ఆయన చెప్పారు.

5 కిలోల మామిడి పండ్ల బుట్టలో 12-15 వరకూ ఉంటాయని ఆయన వివరించారు. మీరు ఏం చెయ్యాలి అంటే మీకు ఎన్ని కిలోలు కావాలి అనే విషయాన్ని ఫోన్ చేసి చెప్పాలి. ఏ రకం కావాలో చెప్పాలి… రైతుల దగ్గర అందుబాటులో ఉండేవి మాత్రమే చెప్పాలి. కాయ సైజ్ ని బట్టి ధర ఉంటుంది. మామిడి పండ్లు కావాలి అనుకునే వాళ్ళు… కింద ఇచ్చిన నంబర్లకు వాట్సాప్‌ చేయాలని ఉద్యాన శాఖ పేర్కొంది.

79977 24925, 79977 24944 నంబర్లను వినియోగించాలని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఈ ఫోనులో అందుబాటులో ఉంటారని పేర్కొంది. గూగుల్‌ పే, ఫోన్‌పే ద్వారా నగదు చెల్లించాలనుకునేవారు.. 79977 24925 నంబరును వినియోగించాలని ప్రకటనలో వివరించింది. బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా చెల్లించాలనుకుంటే అకౌంట్‌ నంబరు 013910100083888, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఏఎన్‌డిబీ0000139, ఆంధ్రాబ్యాంక్‌, గగన్‌మహల్‌ శాఖలో జమ చెయ్యాల్సి ఉంటుంది అని పేర్కొంది. వినియోగదారులు పూర్తి చిరునామా, పిన్‌కోడ్‌ నంబరుతో పాటు ఫోను నంబరును సందేశం ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news