మాదాపూర్ డ్రగ్స్ కేసు.. పరారీలో సినీ హీరో నవదీప్..!

-

మాదాపూర్ డ్రగ్స్ కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ పరారీలో ఉన్నాడని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. డ్రగ్స్ వ్యవహారంలో కస్టమర్ గా నవదీప్ ఉన్నాడని సీపీ చెప్పారు.

అదేవిదంగా డ్రగ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్ట్ చేసినట్టు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను అదుపులోకి తీసుకున్నామని సీపీ చెప్పారు. రాంచంద్ ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు తెలిసిందన్నారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ అభియోగాలు ఎదుర్కొన్నారు. అప్పట్లో సిట్ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. మీడియాలో వస్తున్న కథనాలపై నవదీప్ స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని హైదరాబాద్ లోనే ఉన్నానని ప్రముఖ వార్త సంస్థ ప్రతినిధికి ఆయన తెలిపారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news