కేటీఆర్ కు పదేళ్ల శిక్ష పడే తప్పులున్నాయి : మహేష్ గౌడ్

-

విచ్చల విడిగా అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు కోసం జనం చూస్తున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అలాగే కేటీఆర్ కు కేవలం రెండేళ్లు కాదు.. పదేళ్ల శిక్ష పడే తప్పులు ఉన్నాయి అని పేర్కొన్నారు. ఇక కాళేశ్వరం కోసం అంత ఖర్చు పెట్టి కట్టింది.. కేవలం కమిషన్ల కోసమే. అయితే మా ప్రభుత్వంలో అన్యాయంగా ఎవర్ని శిక్షంచం.. తప్పు చేసిన వాళ్లకు మాత్రం వదిలి పెట్టం.. వారికీ శిక్ష పడాల్సిందే అని తెలిపారు.

అలాగే విద్యుత్ అప్పటి కంటే చాలా తక్కువ ధరకు కొంటున్నం. విద్యుత్ కొనుగోళ్ళలో కూడా అవకతవకలు జరిగాయి. అప్పుడు కేసీఆర్ కు ఉన్న ఆర్థిక వెసలుబాటు ఇప్పుడు మాకు లేదు. ఆర్థికంగా నిర్వుండం ఉంది. వచ్చే అధ్యాయంలో వడ్డిలకే ఎక్కువ కట్టాల్సి వస్తోంది. అయితే కేసీఆర్ లాగా మేము ప్రజలను మోసం చెయ్యాం. ఇచ్చిన హామీలు అమలు చేస్తాం అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version