ప్రచారంలో బిజీబిజీగా ఈటల.. ఇవాళ్టి షెడ్యూల్ ఇదే

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ప్రచారాలతో బిజీబిజీగా ఉన్నారు. రోజుకు నాలుగైదు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇవాళ బోయిన్పల్లిలో పద్మశాలి సంఘం నేతలతో అల్పాహార భేటీలో పాల్గొన్ారు. అనంతరం అదే ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ఆనంద్ బాగ్ డివిజన్లోని బిహార్ బస్తీలో ఈటల పర్యటించారు. అక్కడి ఓటర్లకు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఆ తర్వాత కంటోన్మెంట్లో పర్యటించిన ఈటల అక్కడ కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్నారు.

ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే..

మధ్యాహ్నం 12 గంటలకు మూలాలి రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో బుడిగ జంగాల కమ్యూనిటీతో భేటీ

1 గంటలకు శుభమ్ కన్వెన్షన్లో ఎక్స్ సర్వీస్మెన్తో సమావేశం

1.30 గంటలకు శుభం బాంక్వెట్ హాల్లో గౌడ సంఘంతో భేటీ

1.45 గంటలకు మేరు సంఘంతో సమావేశం

సాయంత్రం 6 గంటలకు కేపీహెచ్బీలో రోడ్ షో

Read more RELATED
Recommended to you

Latest news