నాకు కేసీఆర్ అండగా ఉన్నారు..ఎవరూ ఏం పీకలేరు – మల్లారెడ్డి

-

నాకు కేసీఆర్ అండగా ఉన్నారు..ఎవరూ ఏం పీకలేరని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ రైడ్స్‌ పై ఇవాళ మల్లారెడ్డి ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీ రైడ్స్‌ విషయం సీఎం కేసీఆర్‌ ముందే చెప్పారు.. బీజేపీ కుట్రలకు భయపడేదిలేదని పేర్కొన్నారు.

కేంద్ర బలగాలతో పెద్ద ఎత్తున మాపై దాడులు చేశారని ఐటీ రైడ్స్‌పై మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. మెడికల్‌ సీట్లల్లో అక్రమాలు జరిగాయని అంటున్నారని.. మేం దీంట్లో ఎలాంటి డొనేషన్లు తీసుకోలేదని పేర్కొన్నారు. ఐటీ అధికారులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని.. కేంద్రం వీళ్లను నడిపిస్తుందని నిప్పులు చెరిగారు మల్లారెడ్డి. నా కొడుకు, కోడలు ఆస్పత్రి ఉన్నారు.. మేం పోతామంటే వెళ్లనివ్వలేదని ఫైర్‌ అయ్యారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా చూడలేదని.. నిప్పులు చెరిగారు మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news