ఒక పక్క పోలీసులు వేటాడుతున్నా బంద్ అంటున్న మావోలు

-

ఆదిలాబాద్ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతుంది. కొమురం భీం- మంచిర్యాల జిల్లాల్లోని ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో గాలిస్తున్న పోలీసులు, మావోయిస్ట్ ల కోసం డ్రోన్ లను కూడా వాడుతున్నారు. ఇటీవల వరుసగా జరిగిన మూడు ఎన్ కౌంటర్లకు నిరసనగా రేపు బంద్ కు పిలుపునిచ్చారు మావోలు. అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పోలీసులు అనుమానం ఉన్న వారిని విచారిస్తున్నారు.

18 maoists in chhattisgarh surrendered to police
18 maoists in chhattisgarh surrendered to police

మావోయిస్ట్ ల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు సిద్దం చేస్తూ అవసరమైతే బలగాలను పెంచాలని భావిస్తున్నారు. మావోయిస్ట్ అగ్ర నేత అడెల్లు కోసం కూంబింగ్ జరుగుతుంది. జిల్లాకు డీజీపీ మహేందర్ రెడ్డి వెళ్లి వచ్చిన తర్వాత పోలీసులు మరింత దూకుడు పెంచారు. ఐజి నాగిరెడ్డి కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news