ఒకే వేదికపై అంగరంగ వైభవంగా ఒక్కటైన 220 జంటలు

-

నాగర్ కర్నూల్ జిల్లాలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో 220 జంటలు ఒక్కటయ్యాయి. ట్రస్టు ఛైర్మన్‌, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక వివాహాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

సినిమా సెట్టింగ్‌లను తలపించేలా పాఠశాల ఆవరణను అలంకరించారు. 220 పందిళ్లు వేసి.. ఉదయం 10.05 గంటలకు 220 మంది పూజారులతో శాస్త్రోక్తంగా పెళ్లిళ్లు జరిపించారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేశవరావు, విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దంపతులు, కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, ఎస్పీ మనోహర్‌లు కొత్త జంటలను ఆశీర్వదించారు. సాయంత్రం ప్రతి జంటకు బీరువా, మంచం, పరుపు, దుప్పట్లు, రెండు కుర్చీలు, స్టీల్‌ సామగ్రి, కుక్కర్‌, మిక్సీ తదితర సామగ్రిని అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news