BREAKING : ప్రయాణికులకు అలర్ట్‌… హైదరాబాద్‌ లో మెట్రో రైళ్లు రద్దు

-

BREAKING : ప్రయాణికులకు అలర్ట్‌… హైదరాబాద్‌ లో మెట్రో రైళ్లు రద్దు అయ్యాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలోనే.. హైదరాబాద్‌ లో మెట్రో రైళ్లు రద్దు అయ్యాయి. ఈ మేరకు మెట్రో నిర్వాహణ సంస్థ కీలక ప్రకటన చేసింది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలోనే..తాము ముందు జాగ్రత్తగా.. మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది మెట్రో నిర్వాహణ సంస్థ. ఈ నేపథ్యంలో.. ప్రయాణికులు ఎవరూ కూడా మెట్రో స్టేషన్లకు రాకూడదని సూచనలు చేశారు.

కాగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇవాళ ఉదయం నుంచి ఆర్మీ అభ్యర్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటనపై కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.. స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇదని పేర్కొన్నారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని ప్రభుత్వం,పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news