తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనున్న ఎంఐఎం

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 9 స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటన విడుదల చేశారు. ఎంఐఎం అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల చేశారు.

1. చార్మినార్ – జుల్ఫేఖర్ అహ్మద్
2. చాంద్రాయణ గుట్ట – అక్బరుద్దీన్ ఓవైసీ
3. మలక్ పేట్ – అహ్మద్ బలాల
4. నాంపల్లి – మాజిద్ హుస్సేన్
5. కార్వాన్ – కౌజర్ మోహినుద్దిన్
6. యాకుత్ పుర – జాఫర్ హుస్సేన్ మీరజ్

బహదూర్ పుర, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు అసదుద్దీన్ ఓవైసీ. ఈ సందర్భంగా అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అంబర్ పేట నుంచి ఓడిపోతాడనే కిషన్ రెడ్డి పారిపోయాడు. మరోవైపు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు అసదుద్దీన్ ఓవైసీ. గతంలో 7 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం ఈసారి తొమ్మిది స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు ఎంపీ అసదుద్దీన్.

Read more RELATED
Recommended to you

Latest news