కాంగ్రెస్ కు షర్మిల మద్దతుపై స్పందించిన భట్టి విక్రమార్క

-

ఈ రోజు ఉదయం YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ వైఎస్సార్ అభిమానుల నమ్మకాన్ని తుంచేసింది. ఒక వైఎస్ తనయురాలిగా షర్మిలను సాదరంగా ఆహ్వానించినా తెలంగాణ ప్రజలు… తీరా షర్మిల తీసుకున్న నిర్ణయం (ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం) పట్ల నిరాశతో ఉన్నారు. తాజాగా షర్మిల నిర్ణయం పై కాంగ్రెస్ సి ఎల్ పి నేత భట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల తీసుకున్న నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉందని భట్టి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల కోసమే పోరాడుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉంటూ ప్రజలని వంచించిన కేసీఆర్ కు రానున్న ఎన్నికలతో శుభం పలకలంటూ ప్రజలను కోరారు. రానున్న ఎన్నికలు ప్రజల తరపున పోరాడుతున్న ప్రజల తెలంగాణకు మరియు దొరల తెలంగాణకు మధ్యన జరుగుతున్నాయంటూ పిలుపునిచ్చారు భట్టి.

ఇక నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ఏపార్టీకి తమ మద్దతును ఇవ్వనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news