BREAKING : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాలు ఫోర్జరీ

-

BREAKING : తెలంగాణ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు ఊహించని షాక్‌ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాలు ఫోర్జరీ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం సిఫార్సు లేఖలు రాశారు. అయితే… తెలంగాణ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓఎస్ డీ… ఫిర్యాదుతో ఇద్దరు నిందితులపైన కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు.

చాలా మందికి డబుల్ బెడ్ రూమ్ పేరుతో సిఫార్సు లేఖ ఇచ్చిన ఇద్దరు నిందితులు… మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాలు ఫోర్జరీ చేశారు. నిందితులు సంగారెడ్డి అమీన్‌పూర్‌ మండలం నర్రెగూడం గ్రామానికి చెందిన ఎం.డి.గౌస్‌పాషా, గుంటి శేఖర్‌ గా గుర్తించారు పోలీసులు. మంత్రి ఓఎస్డీ డాక్టర్‌ ఎస్‌.ఎం.రాజేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు.. ఆ నిందితులను అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news