హరీశ్ రావు బీజేపీలో చేరతారు : మంత్రి కోమటిరెడ్డి

-

ఎంపీ ఎన్నికల తరువాత మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీలో చేరతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు. తామేమి చేరికల గేట్లు ఎత్తలేదని.. ఆ పార్టీ వాళ్లే దూసుకొని వస్తున్నారని తెలిపారు. ఇది కేసీఆర్ నేర్పిన విద్యనే అని,  కేసీఆర్  చేసిన పాపం ఆయనకే తగులుతోందని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ చిల్లర వ్యవహారమన్నారు.

కేసీఆర్ పాపాల మూలంగా కరువు వచ్చింది. యాదగిరిగుట్టపై కేసీఆర్ బొమ్మ, కారు బొమ్మ వేసుకున్న పాపం తగిలింది. కేసీఆర్ ట్యాపింగ్ పాపంతో చాలా మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రతీది రాజకీయం చేయడమే కేసీఆర్ పనే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలే అయింది. మాపై దాడి చేయడం కేకే లాంటి సీనియర్ నేతలకు నచ్చకనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్  పార్టీలో ఎవ్వరికీ టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news