కాంగ్రెస్ నాయకులను రాష్ట్రంలో తిరగనివ్వం : కౌశిక్ రెడ్డి

-

జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఇందులో కౌశిక్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. దళిత బంధు ఎన్నికల తర్వాత ఇస్తామన్న హామీ ఏమైందో చెప్పాలి. దళిత బంధు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుంది అని పేర్కొన్నారు. అలాగే రైతుబంధు ఇప్పటికీ రైతుల ఖాతాలో ఎందుకు జమ చేయలేదో చెప్పాలి అని ప్రశ్నించారు.

అలాగే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామన్న ప్రభుత్వం ఎందరికి చేసిందో చెప్పాలి. రైతుబంధు రైతు రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యేలను రాష్ట్రంలో ఎక్కడ తిరగనివ్వం. దేశంలో ఎక్కడలేని విధంగా హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా కేసీఆర్ ప్రవేశపెట్టారు. దళిత బంధు లబ్ధిదారులు అకౌంట్లో ఉన్న రెండవ విడత నగదును వెంటనే రిలీజ్ జేయాలని డిమాండ్ చేస్తున్నాం అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news