భద్రతా సిబ్బందితో వీడియోలపై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి క్లారిటీ

-

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా మారిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం వై కేటగిరి సెక్యూరిటీని కల్పించిన విషయం తెలిసిందే. అయితే తన భద్రతా సిబ్బందితో చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వివాదంలో చిక్కుకున్నారు రోహిత్ రెడ్డి. తన గన్ మెన్ లు, సెక్యూరిటీ సిబ్బందితో చేసిన వీడియోలో రోహిత్ రెడ్డి కాషాయ వస్త్రాలు ధరించి నడుచుకుంటూ వస్తుండగా.. వెనుక నుండి సెక్యూరిటీ సిబ్బంది ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉంటారు.

ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. కేజీఎఫ్ మూవీ స్టైల్ లో రోహిత్ రెడ్డి నడుచుకుంటూ వచ్చే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే. తాను సిబ్బందిని వీడియోల కోసం వాడుకునే రకం కాదని.. నడుచుకుంటూ వస్తుంటే స్నేహితులు ఫన్నీగా వీడియో తీశారని పేర్కొన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం తనకు లేదన్నారు రోహిత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ లాగా కావాలని వీడియో తీసుకోలేదని సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news