మోడీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైంది – ఎమ్మెల్సీ కవిత

-

కేంద్రంలో మోడీ సర్కార్ అన్ని రంగాలలో విఫలమైందని ఆరోపించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మహిళా రిజర్వేషన్ కోసం పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికేపలు పార్టీలు నేటి రౌండ్ టేబుల్ భేటీకి మద్దతు ఇచ్చాయని తెలిపారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఈడీ విచారణకు హాజరవుతానని చెప్పారు. మరోవైపు ఈడి నోటీసులపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు తీసుకుంటున్నట్లు సిజెఐ ధర్మసనం తెలిపింది. ఈనెల 24న వాదనలు వింటామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news