సత్తుపల్లిలో విషాదం.. కొడుకులను చెరువులోకి తోసేసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

-

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ త‌ల్లి త‌న ఇద్ద‌రు కుమారుల‌ను చెరువులోకి తోసేసి అనంతరం తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన సత్తుపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి దామరచెరువులో ఇవాళ మూడు మృతదేహాలు పైకి తేలాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులు, గజ ఈతగాళ్ల సాయంతో మృత దేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. అనంతరం వాటిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను మృదుల, ప్రజ్ఞ(5), మహదేవ్(7)గా పోలీసులు గుర్తించారు. మృతుల తన ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఎవరైనా చంపేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి మరణానికి గల కారణాలపై కుటుంబ సభ్యులు, బంధువులను ఆరా తీస్తున్నారు. వీరి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news