రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు KTR షాక్ !

-

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు KTR షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన లో భాగంగా నిన్న గోదావరిఖనిలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేరు ను ప్రస్తావనించలేదు మంత్రి కేటీఆర్.

ఈ నెల 5 వ తారీకు హుస్నాబాద్ సభ లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరిన కేటీఆర్‌…. అదే రోజు సాయంత్రం కాజీపేట లో జరిగిన సభ లో వినయ్ భాస్కర్ పేరు ను ప్రస్తావించి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అలాంటిది నిన్న గోదావరిఖనిలో జరిగిన సభలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేరును ప్రస్తావించకపోవడంతో అతనికి టికెట్‌ రాదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వర్గం కాస్త ఆందోళన కు గురవుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే..నవంబర్‌ వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news