బీజేపీతో కొట్లాడింది కేసీఆర్ మాత్రమే…కాంగ్రెస్ నాయకులు హోల్‌సేల్‌గా పోతారు !

-

కాంగ్రెస్‌పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి కాంగ్రెస్ నాయకులు హోల్‌సేల్‌గా వెళ్తున్నారు… కానీ బీజేపీతో కొట్లాడింది కేసీఆర్ మాత్రమే అన్నారు ఎంపీ అరవింద్. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తారని చెప్పారు. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా షాకింగ్స్ కామెంట్స్ చేయడం గమనార్హం. ముఖ్యంగా రేపో ఎల్లుండో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడంట అని పేర్కొన్నారు. అలాగేఈరోజు కాంగ్రెస్ నుంచి ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలో చేరింది..నిన్న మిలింద్, మొన్న జిందాల్, అంతకు ముందు చౌహన్ బీజేపీలోకి వచ్చిండ్రు అంటూ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news