వాజ్ పేయి కి నివాళులర్పించిన ఎంపీ బండి సంజయ్

-

అటల్ బిహారీ వాజ్ పేయ్ జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు నివాళులు అర్పించారు బండి సంజయ్. వాజ్ పేయి ఆలోచన విధానం చాలా బాగుండేది. విలువల తో కూడిన రాజకీయాలు చేసే మంచి మనిషి. ఆర్ఎస్ఎస్ సభ్యత్వం ఉన్నవాళ్లు పార్టీ లో ఉండకూడదు అని చెప్పినప్పుడు పదవులకు రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి వాజ్ పేయ్ అని గుర్తు చేశారు. దేశంలోని పేద ప్రజలకు సేవ చేసే గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ. కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 28 నుండి ఆరు గ్యారెంటీ లకు దరఖాస్తులు స్వీకరించడం తాము స్వాగతిస్తున్నాం అని తెలిపారు బండి సంజయ్.

గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా కొత్త ప్రభుత్వం చేయొద్దు. దరఖాస్తు లు తీసుకుని అందరికి న్యాయం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ గతంలో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేయాలి. రేషన్ కార్డ్ ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయడం సరి కాదు అన్నారు. గత 10 ఏళ్లలో పేదలకు కొత్త రేషన్ కార్డులు రాలేదు. 10 లక్షల మంది వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.ముందుగా రేషన్ కార్డులు మంజూరు చేయాలి. రేషన్ కార్డ్ ల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు. మళ్ళీ ఎన్నికల కోడ్ పేరుతో పథకాలు అపవద్దు. 90రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ తెలంగాణ లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news