బీఆర్ఎస్ ను పార్లమెంట్ గేట్ తాకనివ్వం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

-

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటును ఎన్నికలు డిఆర్ఎస్ కు ఒక సీటు కూడా రానివ్వమని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుందని జోస్యం అని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో నే బీఆర్ఎస్ పని అయిపోయిందని.. ఉనికి కాపాడుకోవడానికి ఆ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కానీ అదంతా వృధాగానే మిగిలిపోనున్నదని ఎద్దేవ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎన్నికల అనంతరం రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని.. కేటీఆర్ మళ్లీ అమెరికాకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. కెసిఆర్ కుటుంబం పై త్వరలోనే విచారణ జరుపుతామని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news