రేపో, ఎల్లుండో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడంట.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ కామెంట్స్..!

-

తెలంగాణ రాష్ట్రంలో మే 13 పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరూ సెటైర్లు వేసుకుంటున్నారు. కొంత మంది బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని.. మరికొందరూ బీజేపీ ఖాళీ అవుతుందని.. ఇంకొందరూ కాంగ్రెస్ ఖాళీ అవుతుందని.. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇటీవలే బీఆర్ఎస్, బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తారని చెప్పారు. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా షాకింగ్స్ కామెంట్స్ చేయడం గమనార్హం. ముఖ్యంగా రేపో ఎల్లుండో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడంట అని పేర్కొన్నారు. అలాగేఈరోజు కాంగ్రెస్ నుంచి ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలో చేరింది..నిన్న మిలింద్, మొన్న జిందాల్, అంతకు ముందు చౌహన్ బీజేపీలోకి వచ్చిండ్రు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి వస్తాడని సంచలన కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news