బీఆర్ఎస్ కు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా.. కాంగ్రెస్ లో చేరిక!

-

లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. మరికొందరు కూడా కారు దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవలే వరంగల్ ఎంపీ పార్టీని వీడిన విషయం తెలిసిందే. పసునూరి దయాకర్ పార్టీ వీడి 24 గంటలు కూడా గడవకముందే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఎంపీ రంజిత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్టు చేశారు. ఇన్ని రోజులు పార్టీలో ఉండి చేవెళ్ల ప్రజలకి సేవ చేసేందుకు అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామా ఆమోదించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ బీఆర్ఎస్ పార్టీలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు రంజిత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news