గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉంది… కేసీఆర్ ప్రోత్సాహానికి ధన్యవాదాలు: నిఖత్ జరీన్

-

గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉందని అన్నారు ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించిన తర్వాత తొలిసారిగి ఆమె హైదరాబాద్ కు వచ్చారు. నన్న ప్రోత్సహించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడ ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాని నిఖత్ జరీన్ అన్నారు. కామన్ వెల్త్ గేమ్స్ కోసం నేను ప్రస్తుతం కృషి చేస్తున్నానని.. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కూడా రాణిస్తా అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీనా కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఆణిముత్యాలు ఉన్నారని.. తల్లిదండ్రుల ప్రోత్సహంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహంతో ఈ ఘనత సాధించిందని ఆయన అన్నారు. భవిష్యత్ లో కూడా అనేక విజయాలు సాధించాలని.. ఒలింపిక్ లో కూడా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని మంత్రి అన్నారు. దేశంలో ఎవ్వరు చేయని కృషి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో క్రీడలకు కృషి చేస్తున్నారుని క్రీడలకు, టూరిజం శాఖకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ కు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన వెల్లడించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తామని మంత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news