తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ.. బీఆర్ఎస్ భారీ ప్లాన్

-

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం దిశగా వెళ్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆనవాళ్లను చేరిపివేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నాంలో కాకతీయ కళాతోరణాన్ని ప్రభుత్వం చేరిపివేస్తామంటోందని మండిపడ్డారు. అలాగే కాకతీయులు నిర్మించిన గొలుసు కట్టు చెరువులను కూడా లేకుండా చేస్తారా..? అని ప్రశ్నించారు.

2001లో తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైందన్న కర్నె.. ఈ జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అవుతోందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 1వ తేదీన గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు కేసీఆర్ చేరుకుని నివాళులు అర్పిస్తారని చెప్పారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వరకు పదివేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 2న జాతీయ జెండా, పార్టీ జెండాను తెలంగాణ భవన్లో ఎగురవేస్తామని, అనంతరం భవన్ లో సమావేశం, ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుందని వెల్లడించారు. జూన్ 3న జిల్లా కార్యాలయాల్లో జాతీయ జెండాలు, పార్టీ జెండాలను జిల్లా అధ్యక్షులు ఎగురవేస్తారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news