PM MODI: ఇవాళ తెలంగాణకు ప్రధాని మోడీ..అక్కడే భారీ బహిరంగ సభ

-

PM MODI: ఇవాళ తెలంగాణకు మరోసారి ప్రధాని మోడీ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు మహబూబ్నగర్ పార్లమెంట్ నారాయణపేట బహిరంగ సభలో పాల్గొననున్నారు మోడీ. ఇక ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఎల్బి స్టేడియంలో జరిగే సభలో పాల్గొననున్నారు మోడీ.

once again pm modi off to telangana

ఎల్బి స్టేడియం లో జరిగే మీటింగ్ తో మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ మేరకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ..ఇవాళ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు మోడీ సభ ఉంటుంది..యువత మహిళలు పెద్ద ఎత్తున హాజరై ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలని కోరుతున్నానన్నారు.

కార్యకర్తలు, శ్రేణులు సామూహికంగా ప్రధాని మోడీ సభకు హాజరు కావాలి..బూత్ స్థాయిలోని కార్యకర్తలు కచ్చితంగా స్థానికంగా ఉన్న ప్రజల్ని కూడా సభకు తీసుకురావాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీ ఫోటో తీసుకోని సోషల్ మీడియా వేదికగా పంచుకోవాలి..నన్ను గెలిపించాలని కోరుతున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news